మేష, కర్కాటక, సింహ రాశి లవారు గ్రహణం వీక్షించ రాదు - ప్రధాన అర్చకులు

మేష, కర్కాటక, సింహ రాశి లవారు గ్రహణం వీక్షించ రాదు - ప్రధాన అర్చకులు

ముద్ర,యాదగిరిగుట్ట న్యూస్ :ఈనెల 28వ, తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం మన ప్రాంతంపై లేదని మేష కర్కాటక సింహరాశిల వారు గ్రహణం వీక్షించరాదని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్ తీగల్ లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత గ్రహణం ప్రారంభమై రెండు గంటల ఐదు నిమిషములకు ముగుస్తుందన్నారు. గర్భిణీలు జాగ్రత్త వహించాలని తెలిపారు. మరుసటి రోజు ఆదివారం ఆలయాలను దర్శించుకోవాలని కోరారు యాదాద్రి ఆలయం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ద్వారబంధనం జరుగుతుందని అనంతరం ఆదివారం వేకువ జామున సంప్రోక్షణ అనంతరం యధావిధిగా నిత్యకాయం కార్యాలు పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.