ఎంపీ కోమటిరెడ్డి ని కలిసిన కాంగ్రెస్ నాయకులు....

ఎంపీ కోమటిరెడ్డి ని కలిసిన కాంగ్రెస్ నాయకులు....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలేరు ఎంపీపీ గందమల్ల అశోక్ ఆధ్వర్యంలో శనివారం నాడు భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గ్రామానికి ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని హై లెవెల్ బ్రిడ్జిగా నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు బండ వీర మల్లయ్య. నాయకులు అమృతం బాలరాజు. కంపరాజు వెంకటేశ్వరరాజు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్. నాయకులు నవీన్. అశోక్. చరణ్. కార్తీక్. నవీన్. ఉపేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.