ప్రభుత్వ విప్ సమక్షంలో పలువురి చేరిక....

ప్రభుత్వ విప్ సమక్షంలో పలువురి చేరిక....

ఆలేరు (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజాపేట మండలంలోని పాముకుంట ఎంపీటీసీ సభ్యులు ఎడ్ల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీ లకు  చెందిన వంద మంది పైగా యూవకులు శనివారం నాడు  ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో గ్రామ పంచాయితీ సభ్యులు. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు దాదాపు 100 మంది పైగా చేరారు వారికి ఆమె బి ఆర్ ఎస్ కండువాలు మెడలో కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. రాజపేట బిఆర్ఎస్ నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.....