గీత కార్మికుని పరామర్శించిన హరి శంకర్ గౌడ్.....

గీత కార్మికుని పరామర్శించిన హరి శంకర్ గౌడ్.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన గీతా కార్మికుడు బోరుగు దశరథ గౌడ్ రోజువారి వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై జారిపడి తీవ్రత గాయాలై హైదరాబాదులోని నాగోల్ లో గల సుప్రజా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు సుదగాని హరిశంకర్ గౌడ్ శనివారం నాడు హాస్పిటల్ కి వెళ్లి దశరథ గౌడును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులను దశరథ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండవుల బసవయ్య గౌడ్. ఊరు స్వామి. బూరుగు శ్రీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.