విశ్వహిందూ పరిషత్ గంగసాని పల్లి గ్రామ సమితి ఎన్నిక

విశ్వహిందూ పరిషత్ గంగసాని పల్లి గ్రామ సమితి ఎన్నిక

భువనగిరి ఆగస్టు 15 (ముద్ర న్యూస్):-భువనగిరి మండలం గంగసానిపల్లి గ్రామంలో మంగళవారం విశ్వహిందూ పరిషత్ గ్రామ సమితి(కమిటీ) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి తోట భాను ప్రసాద్  మాట్లాడుతూ ప్రతి గ్రామంలో విశ్వహిందూ పరిషత్ సమితి ఏర్పాటు ద్వారా హిందూ సమాజం సంఘటితంగా సుభిక్షంగా ఉండేవిధంగా గ్రామస్తులంతా కలిసి మెలిసి హిందుత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గంగసాని పల్లి గ్రామ శాఖ అధ్యక్షులుగా పద్మ బిక్షపతి, ఉపాధ్యక్షులుగా ఎడ్ల రాజశేఖర్, పగుడాల రాజు, కార్యదర్శిగా ఎడ్ల సాయిప్రసాద్, సహకార్యదర్శిగా భానూరి వెంకటేష్,  సత్సంగ్ ప్రముఖ్ గా రాంపల్లి విష్ణు, బజరంగ్ దళ్ కన్వీనర్ గా బంటు మహేష్, కో కన్వీనర్లుగా  ఎడ్ల రఘుపతి,  భీమగాని శశి కుమార్, గోరక్ష ప్రముఖ్  భీమగాని మహేష్, విద్యార్థి ప్రముఖ్ బోయిని మధు, విద్యార్థి సహ ప్రముఖ్ గంగాదేవి, రవితేజ ,సాప్తహిక్ మిలన్ ప్రముఖ్ జోగు ఉదయ్ కిరణ్, సురక్ష ప్రముఖ్ ఎడ్ల రామకృష్ణ, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ యాదాద్రి జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం, యాదవ్ కోశాధికారి చామ రవీందర్, బజరంగ్దళ్ యాదాద్రి జిల్లా కన్వీనర్ మేకల భాను, భువనగిరి పట్టణ కన్వీనర్ పొన్నాల వినయ్, విశ్వహిందూ పరిషత్ భువనగిరి మండల కార్యదర్శి రెడ్డిబోయిన బాలరాజు, భువనగిరి ప్రఖండ సంఘటన కార్యదర్శి పూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.