నమాత్ పల్లిలో పైళ్ల వనిత రెడ్డి ఇంటింటి ప్రచారం..
![నమాత్ పల్లిలో పైళ్ల వనిత రెడ్డి ఇంటింటి ప్రచారం..](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_653a7e3b047bc.jpg)
- మంగళ హారతులు పట్టిన మహిళలు
ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి నియోజక వర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి వనితారెడ్డి గురువారం సాయంత్రం మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు వనితారెడ్డికి మంగళ హారతులు పట్టి ఆహ్వానించారు. తమ ఓటు పైళ్ల శేఖర్ రెడ్డి కారు గుర్తుకేననిభరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అతికం లక్ష్మీ నారాయణ, ఎంపీటీసీ, కమ్మాలపల్లీ ఆంజనేయులు, బబ్బురి రమేష్, ఏళ్ళంలా బాలమల్లేష్, కొండాపురం సుధాకర్, సూర్పంగ వెంకటేశం, మల్లేశం, బత్తిని వెంకటేశంలు పాల్గొన్నారు.