ప్రభుత్వానికి మద్యం టెండర్లపై ఉన్న శ్రద్ధ,డబల్ బెడ్రూం ఇండ్ల పంపకంపై లేదా.... ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వం పై జిల్లా సదస్సు పోస్టర్ ఆవిష్కరణ 

ప్రభుత్వానికి మద్యం టెండర్లపై ఉన్న శ్రద్ధ,డబల్ బెడ్రూం ఇండ్ల పంపకంపై లేదా.... ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వం పై జిల్లా సదస్సు పోస్టర్ ఆవిష్కరణ 
  • సీపీఐ (ఎం-ఎల్)  న్యూడెమోక్రసీ 

యాదగిరిగుట్ట ఆగస్టు 19 (ముద్ర న్యూస్) :-కోటి ఆశలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మద్యం టెండర్లపై ఉన్న ఆత్రుత అర్హులైన పేదలకు ఇళ్ళు ఇచ్చే ఆలోచనలో లేదని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు.యాదగిరిగుట్ట మండలం సాదివెల్లి గ్రామంలో జిల్లా సదస్సు పోస్టల్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా బేజాడి కుమార్ పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉచిత పథకాల పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తుందని అన్నారు.అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా కొత్త హామీలను ఇస్తుందని అన్నారు.గడిచిన తొమ్మిదేండ్ల సమయంలో అర్హులైన పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు పంపిణీ చేయలేదో,దళితులకు మూడెకరాల భూమి,దళిత, బీసీ బంద్ ఎంతమందికి అందించిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టర్ల కోసం పెద్ద పెద్ద భవనాలు నిర్మించి,రోడ్లు వెడల్పు చేయడం ఒక్కటే అభివృద్ధి కాదని,అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి కనీస అవసరాలైన తిండి,బట్ట,ఉండడానికి ఇండ్లు అందుబాటులో ఉండాలని అన్నారు.

గృహలక్ష్మీ పేరుతో ప్రజలకు 3 లక్షల రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వం 3లక్షల రూపాయలతో ఎలా ఇల్లు నిర్మాణం జరుగుతుందో చెప్పాలని,పెరిగిన ధరలను అంచనా వేయకుండా 3లక్షల తో చేతులు దులుపుకోవలని చూస్తుందని ఎద్దేవాచేశారు. పొట్ట కూటికోసం గ్రామాలను వదిలి సంవత్సరాల తరబడి ఇంటి అద్దె చెల్లిస్తూ దుర్భర జీవనం గడుపుతున్న ఆటో,భవన నిర్మాణ కార్మికుల తో పాటు,అడ్డ కూలీలు, సాధారణ ప్రజలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు.అర్హులైన వారికి ఫించన్లు, కొత్తరేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలు,పట్టణంలో  విస్తృతంగా ప్రబలుతున్న విష జ్వరాల నియంత్రణకై ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని,వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని,అనారోగ్యం కారణంగా ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని అన్నారు.ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్నారు. సెప్టెంబర్ 15న భువనగిరి  పట్టణంలో జరుగు జిల్లా సదస్సును ప్రజలు, ప్రజాస్వామిక వాదులు జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఇంజ శ్రీనివాస్, కొంగరి సాయిరాం, సుంకే సుగుణ, దగ్గు నరసయ్య, దయ్యాల రాములు, ఎస్ వెంకటయ్య ,మల్లయ్య, రాజయ్య ,బిక్షపతి ,లక్ష్మి, మణెమ్మ, రాములు ,వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.