మెగా హెల్త్ క్యాంపు శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్....

మెగా హెల్త్ క్యాంపు శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్....

రాజపేట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని సింగారం గ్రామంలో ఆదివారం నాడు హీల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందేందుకు హిల్ సొసైటీ చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు.

వీరిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ల కరుణాకర్ రెడ్డి తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. బిఆర్ఎస్ నాయకులు. కార్యకర్తలు. గ్రామ ప్రజలు. హిల్ సొసైటీ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.