వార్డు అభివృద్దే ధ్యేయం - మున్సిపల్ చైర్మన్ శంకరయ్య

వార్డు అభివృద్దే ధ్యేయం - మున్సిపల్ చైర్మన్ శంకరయ్య

ఆలేరు (ముద్ర న్యూస్): ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పర్యటించిన ఆయన వార్డులోని పలు పనులను పరిశీలించారు. అనంతరం ప్రగతి పాఠశాల ప్రక్కనుండి వెళ్లే మురుగు కాలువలు పరిశీలించారు. త్వరలోనే మురుగు కాలువ సమస్య పరిష్కారం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు దూడల సురేష్. ప్రగతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్. బిఆర్ఎస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జింకల భరత్ యాదవ్. సోషల్ మీడియా పట్టణ కన్వీనర్ కటకం బాలరాజు. నాయకులు బాసాని ప్రశాంత్. సిద్దు తో పాటు కాలనీ వాసులు. తదితరులు పాల్గొన్నారు.