బీసీ బందు అర్హులైన బీసీల అందరికీ ఇవ్వాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

బీసీ బందు అర్హులైన బీసీల అందరికీ ఇవ్వాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

భువనగిరి అక్టోబర్ 03 (ముద్ర న్యూస్):-బీసీ బందు అర్హులైనటువంటి  పేద బీసీ లందరికీ తక్షణమే ఇవ్వాలని బిజెపి పట్టణ అధ్యక్షులు పాదరాజు ఉమాశంకర్ రావు అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్  మాట్లాడుతూ బీసీ బందు అనేది పేద బీసీల అందరికీ ఇవ్వాలి కానీ లోకల్ ఎమ్మెల్యే , బి ఆర్ఎస్ నాయకులు కలిసి వారికి నచ్చిన వారికి, ఎక్కడైతే బిఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నారో అక్కడ మరియు  బిఆర్ఎస్ కార్యకర్తలకి మాత్రమే బీసీ బందు ఇస్తున్నారని ఈ విషయమై మున్సిపల్ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న  బిజెపి నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం సమంజసం కాదు అని, మహిళా కౌన్సిలర్ అనికూడా చూడకుండా విచక్షణ రహితంగా  తిసికెళ్ళి పోలీస్ స్టేషన్ తరలించడం మంచి పద్ధతి కాదని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్ రావు, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శి పంచద్దుల, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ యశోరద, కౌన్సిలర్స్ రత్నపురం బలరాం ,జనగాం కవిత నరసింహ చారి ,నల్లమాసు సుమ వెంకటేశ్వర్లు ,ఉదయగిరి విజయ్ ,బొర్ర రాకేష్ ,మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వైజయంతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడత భాస్కర్ ,ఎంగిలి లక్ష్మణ్ , ఈదులకంటి కరుణాకర్,మేడి కోటేష్,రత్నపురం శ్రీశైలం, పట్నం కపిల్, తుమ్మల నాగేష్ ,పట్నం దిలీప్, కిషన్ జి ,బెజ్జంకి రామకృష్ణారెడ్డి ,సంతోష్, మహమూద్, మల్లికా, చారి ,రాజు చారి ,మహేష్, శ్రీధర్, సన్నీ ,నరేందర్ రెడ్డి ,పవన్,మరియు బీసీ బందు అప్లికేషన్ ఇచ్చినవారు తదితరులు పాల్గొన్నారు.