సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు పూర్తి - సభ ఏర్పాట్లను పరిశీలించిన డిసిపి రాజేష్ చంద్ర
ముద్ర ప్రతినిధి భువనగిరి : ఈనెల 16న భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదికను గులాబీ రంగు టెంట్ల తో అందంగా సుందరీకరించారు. సభా స్థలం వద్ద ఇబ్బందిగా ఉన్న కరెంటు వైర్లను, ట్రాన్స్ఫార్మర్ ను విద్యుత్ అధికారులు సరి చేశారు. బిఆర్ఎస్ నాయకులు సభాస్థలి వద్ద ఉంటూ పనులను సమీక్షిస్తున్నారు.
సభ ఏర్పాటును పరిశీలించిన డిసిపి రాజేష్ చంద్ర..
సోమవారం జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను డిసిపి రాజేష్ చంద్ర ఆదివారం పరిశీలించారు. సీఎం కెసిఆర్ సభ వేదికకు వచ్చే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.