ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసిన తొలి జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు చోటు దక్కించుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఖరారయ్యారు. అలాగే నల్లగొండ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ నుండి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి మాజీమంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు  కుందూరు జయవీర్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గ నుంచి బీర్ల ఐలయ్య టికెట్ పొందిన వారిలో ఉన్నారు. వీరిలో నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి ఒకరు బీసీ సామాజిక వర్గానికి ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు