సంపత్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది

సంపత్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది
  • బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలో సంపత్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.14 ఏళ్ళు పార్టీకి, ఉద్యమానికి నిబద్దతగా పనిచేశారన్నారు. ఆయన సేవలను పార్టీ ఎప్పుడు విస్మరించదన్నారు. సంపత్ రెడ్డి కూతురు, సతీమణికి, కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, నియోజకవర్గంలోని ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.