ఎన్ఎస్యూఐ లీడర్ల అరెస్టు అమానుషం
![ఎన్ఎస్యూఐ లీడర్ల అరెస్టు అమానుషం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642c4188d1d0c.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ: రాష్ట్రంలో జరుగుతున్న లీకుల వ్యవహారంపై ప్రశ్నిస్తున్న ఎన్ఎస్యూఐ లీడర్లను అరెస్టు చేయడం అమానుషమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలువేరు అభి గౌడ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్ అన్నారు. మంగళవారం జనగామలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 10వ తరగతి పేపర్ లీకేజ్ విషయంలో టెన్త్ బోర్డును ముట్టడించిన ఎన్ఎస్యూఐ నాయకులపై ప్రభుత్వ చాతకాని తనానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో అన్నీ అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వం ఆఖరికి 10వ తరగతి పేపర్ను అమ్ముకునే స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో సాయికుమార్, గోపి, ప్రేమ్ పాల్గొన్నారు.