కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు

కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐడీఓసీలోని మహిళా ఉద్యోగులు బతుకమ్మలతో హాజరై బతుకమ్మ లు ఆడారు. ఓటు హక్కు, వినియోగంపై బతుకమ్మలు ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ  ఓటు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యువో జయంతి, డీఎస్ఓ రోజా రాణి ఎక్సైజ్ ఆఫీసర్ కృష్ణప్రియ, హ్యాండ్లూమ్స్ చౌడేశ్వరి, అగ్రికల్చర్ ఆఫీసర్ వినోద్ కుమార్ , బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్, డీఈవో రాము పాల్గొన్నారు.