పెద్దమ్మ దేవాలయంలో దొంగల బీభత్సం 

పెద్దమ్మ దేవాలయంలో దొంగల బీభత్సం 

ముద్ర,తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట పెద్దమ్మ ఆలయంలో మరియు రెండు కిరాణా షాపులలో దొంగతనం చేసిన దుండగులు.గ్రామస్తులు వెల్లడించిన ప్రకారం తంగళ్ళపల్లి మండలంలోని రాళ్ల పేట గ్రామం పెద్దమ్మ ఆలయం మరియు గాంధీనగర్ లో రెండు చోట్ల దుండగులు తాళాలు పగలగొట్టి పెద్దమ్మ ఆలయంలోని హుండీ పగలగొట్టి హుండీలోని డబ్బులను వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.షేక్ గోరెమియ మరియు సయ్యద్ గోరి బి కిరణా షాపులలో తాళం పగలగొట్టి సుమారు 5వేల కిరణా సామాగ్రి మరియు డబ్బులను దొంగలించరని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్ ఐ వెంకటేశ్వర్లు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.