పుస్తె మట్టెలు పంపిణి చేసిన బీజేపి నేత లగిశెట్టి శ్రీనివాస్
![పుస్తె మట్టెలు పంపిణి చేసిన బీజేపి నేత లగిశెట్టి శ్రీనివాస్](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f9ae1e58980.jpg)
ముద్ర, వీర్నపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్ణపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన గర్ణపల్లి లక్ష్మణ్ - రేవతి కూతురు అలేఖ్య వివాహాం మార్చి 1న జరగనుంది.ఈ పెండ్లికీ బీజేపి నేత, సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్ తనవంతు సహాయంగా పుస్తె మట్టెలు, గాజులు, పట్టు చీర ఆందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ లకు వధువు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాలోత్ లక్ పతి , దేవేందర్ రెడ్డీ, నరేష్, బండారి మహేష్, శనిగరం రాజేందర్, తిరుపతి , అంకరపు రాజు, గుండెల్లి వేణు, భాస్కర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.