పుస్తె మట్టెలు పంపిణి చేసిన బీజేపి నేత లగిశెట్టి శ్రీనివాస్

పుస్తె మట్టెలు పంపిణి చేసిన బీజేపి నేత లగిశెట్టి శ్రీనివాస్

ముద్ర, వీర్నపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా  వీర్ణపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన గర్ణపల్లి లక్ష్మణ్ - రేవతి  కూతురు అలేఖ్య వివాహాం మార్చి 1న జరగనుంది.ఈ పెండ్లికీ బీజేపి నేత, సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్ తనవంతు సహాయంగా పుస్తె  మట్టెలు, గాజులు, పట్టు చీర ఆందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ లకు వధువు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ  కార్యక్రమంలో బిజెపి నాయకులు మాలోత్  లక్ పతి  ,  దేవేందర్ రెడ్డీ, నరేష్, బండారి మహేష్, శనిగరం రాజేందర్, తిరుపతి , అంకరపు రాజు, గుండెల్లి వేణు, భాస్కర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.