వ్యక్తిని ఢీకొన్న కారు

వ్యక్తిని ఢీకొన్న కారు

డ్రైవర్ పై కేసు నమోదు: ఎస్సై శేఖర్
ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కంకణాల చంద్రయ్య అనే వ్యక్తి ఈనెల 23న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఎల్లారెడ్డిపేట నుండి సిరిసిల్లకు వెళుతున్న కారుతో వెనకాల నుండి ఢీకొట్టగా పక్క ఎముకలు విరిగి సిరిసిల్ల ఏరియ  ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్షతగాత్రుడి కొడుకు బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ మండలం సంకపల్లి గ్రామానికి చెందిన పండుగ పరుశరాములు అనే డ్రైవర్ AP09CJ0949 నెంబర్ గల కారు అతివేగంతో అజాగ్రత్తగా నడిపి తన తండ్రిని ఢీకొట్టాడని దరఖాస్తు ఇవ్వగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.