తనిఖీల్లో రూ. 2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం

తనిఖీల్లో రూ. 2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం

ఇబ్రహీంపట్నం, ముద్ర: ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో డబ్బు, బంగారు ఆభరణాలు పట్టుబడుతున్నాయి. శుక్రవారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలో బీడిఎల్ రోడ్డు సమీపంలో ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఒక కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు రూ. 2 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పచెప్పినట్లు సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు.