జడ్పీ చైర్మన్ కి కన్నీటి వీడ్కోలు

జడ్పీ చైర్మన్ కి కన్నీటి వీడ్కోలు
  • పాల్గొన్న కేటీఆర్, పల్ల, కడియం, మాజీ మంత్రులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మలిదశ ఉద్యమ నాయకుడు, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, గ్రామస్తులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే. సంపత్ రెడ్డి పార్థివదేహాన్ని చివరిసారి దర్శించుకునేందుకు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం తరలించారు.

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, మార్నేని రవీందర్, మాజీ ఎమ్మెల్యే లు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బోడి కుంట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర కృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతి ప్రకటించారు. అంతేకాకుండా మలిదశ ఉద్యమ సమయంలో తనతో పని చేసిన ఉద్యమకారులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాగాల సంపత్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు.