పోచారం గెలుపుతో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు 

పోచారం గెలుపుతో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు 

బాన్సువాడ, ముద్ర:మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో బిఆరెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు.  ఈ సందర్భంగా బాన్సువాడ నుంచి హైదరాబాద్ కు భారీ సంఖ్యలో మంగళవారం నాడు తరలివెళ్లారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన తనయులు డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డిలను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల తీర్పును శిరసా వహిస్తామని, అనుక్షణం ప్రజా సమస్యలపై పోరాడుతామని, ప్రజల్లో ఉంటామని స్పష్టం చేశారు.   ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, షేక్ జుబేర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాత బాలకృష్ణ, ఖయ్యుమ్ నిశాత్, వనం గంగాధర్, లింగం, నందకిషోర్, అమర్ చావుస్, షాదీఖాన చైర్మన్ వాహాబ్, యూసుఫ్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.