రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మరణం

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మరణం
  • రాగట్లపల్లి గ్రామంలో విషాదం 

ముద్ర,ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డి పేట  మండలం రాగట్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మందాటి రాజు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మందాటి రాజు మంగళవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట నుంచి  బైక్ పై రాగట్టపల్లె వెళ్తుండగా శ్రీ చైతన్య   స్కూల్ వద్ద  వేములవాడకు చెందిన షాబీర్ పాషా  వస్తున్న కారు బైకును ఢీకొట్టగా తీవ్ర గాయాల పాలైన రాజును ఎల్లారెడ్డిపేట స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా వైద్యులు పరీక్షించి రాజును హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. కుటుంబ సభ్యులు వెంటనే రాజును హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చేర్పించారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో బుదవారం ఉదయం మరణించాడు. మండల యాదవ సంఘంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ సమయం నుండి ఇప్పటివరకు పార్టీలో క్రియశీలకంగా  పని చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్ సహకారం తో  అభివృద్ధి పనులను చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.మాందాటి రాజు యాదవ్ రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం తో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. రాజు యాదవ్ మృతి పట్ల అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఏ.టి యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజు యాదవ్, వీరవేని మల్లేష్ యాదవ్,ఒగ్గు బాలరాజు యాదవ్, ఎల్లారెడ్డి పేట ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.