ప్రెండ్లి పోలీసింగ్ తో బరోసా పెరిగింది...

ప్రెండ్లి పోలీసింగ్ తో బరోసా పెరిగింది...

మంత్రి కొప్పుల ఈశ్వర్ ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రెండ్లి పోలీసింగ్ తో ప్రజల్లో బరోసా పెరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగ సుమంగళి గార్డెన్ లో జగిత్యాల జిల్లా పోలసుల అధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ హోస్ కార్యక్రమం లో మంత్రి పాల్గోని పోలీస్ శాఖ అవలంబిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పై , సైబర్ క్రైమ్, షీ టీమ్స్, ప్రింగర్ ప్రింట్, కమ్యూనికేషన్,

బాంబ్ డిస్పోసల్ టీమ్, ఆయుధాల గ్యాలరీ, డాగ్ స్క్వాడ్ , ప్రదర్శనలు తిలకించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జగిత్యాల,వేములవాడ ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్, అదనపు కలెక్టర్లు బి. యస్. లత, మంద మకరందు , డి సీఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీఓలు మాధురి, వినోద్ కుమార్, డి ఎస్పిలు ప్రకాశ్, రవీందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.