ఉత్తమ సేవ ప్రశంస పత్రం ఎస్ఐకి అందజేసిన ఎస్పి మహాజన్

ఉత్తమ సేవ ప్రశంస పత్రం ఎస్ఐకి అందజేసిన ఎస్పి మహాజన్

ముద్ర, బోయినిపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పోలీస్ స్టేషన్ లో  విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేందర్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల మర్యాదపూర్వకంగా సేవలందించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని  అందుకున్నారు. సిరిసిల్లలో ఎస్.పి అఖిల్ మహాజన్ ఎస్ఐకి ప్రశంస పత్రాన్ని  అందజేసారు.ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ: విధి నిర్వహణలో నా సేవలు గుర్తించి ఇట్టి ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది,మండల ప్రజలు, ఎస్సై మహేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, రవికుమార్, రవీందర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.