కొల్లాపూర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం 

కొల్లాపూర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం 
  • కార్లు,బైక్ లతో భారీ ర్యాలీ 
  • ఎమ్మెల్యే బీరం కు BRS పార్టీ శ్రేణుల ఘన స్వాగతం

ముద్ర,పానుగల్(ఆగస్టు25):కొల్లాపూర్ కోట పై గులాబీ జెండాను ఎగురవేస్తామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.కొల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నుండి కొల్లాపూర్ కు వస్తున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కార్లు,బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహిస్తు ఘన స్వాగతం పలికారు..వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం నుండి పానుగల్,వీపనగండ్ల,చిన్నంబావి,పెంట్లవెల్లి మండలాల మీదుగా కొల్లాపూర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

పానుగల్ మండల కేంద్రంలో మహిళా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కు హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు.పానుగల్,వెంగలాయి పల్లి,కేతేపల్లి గ్రామాలలో  అంబేద్కర్,గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు..అన్నారం గ్రామంలో BRS  పార్టీ జెండాను ఆవిష్కరించారు.పానుగల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో,వివిధ గ్రామాలలో పార్టీ నాయకులు ఎమ్మెల్యే ను గజమాలతో సత్కరించారు..ఎమ్మెల్యే మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు..గ్రామ గ్రామాన నాయకులు,కార్యకర్తలు  సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ది,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీ చంద్రశేఖర్ నాయక్,రైతు బంధు మండల కోఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్ ,వైస్ చైర్మన్ సోమనాథ్ నాయక్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాము యాదవ్,జిల్లా నాయకులు చంద్ర శేఖర్ నాయక్,జ్యోతినంధన్ రెడ్డి,తిరుపతయ్య సాగర్,,దశరథ్ నాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,సింగిల్ విండో డైరెక్టర్,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.