ఠాణా దివస్ సద్వినియోగం చేసుకోవాలి..

ఠాణా దివస్ సద్వినియోగం చేసుకోవాలి..
  • జులై 4న ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్ లో ఠాణా దివస్..ఎస్పీ అఖిల్ మహాజన్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లో జులై 4న  నిర్వహించే "ఠాణా దివస్" కార్యక్రమాన్ని ఇల్లంతకుంటా మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ వహాజన్ మాట్లాడుతూ,శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, ప్రజల నుండి స్వయంగా దరఖాస్తులు స్వీకరించి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఠాణా దివస్  కార్యక్రమంలో భాగంగా జులై 4(మంగళవారం ) న ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్ లో ఉదయం 10:30 గంటల నుండి అందుబాటులో ఉండి మండల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి,దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను,గ్రామాల్లో నెలకొన్న  శాంతి భద్రతల సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.మండల పరిధిలోని గ్రామాల  ప్రజల ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు,ఫిర్యాదులను  తీసుకువచ్చి పరిష్కరించుకోవలసిందిగా  తెలిపారు.