భూ నిర్వాసితులకు ఐదు గుంటల భూమి కేటాయించాలి

భూ నిర్వాసితులకు ఐదు గుంటల భూమి కేటాయించాలి

ముద్ర,తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన భూనిర్వాసితులు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం అపమని మండేపల్లి గ్రామం నుండి నిరసన ర్యాలీగా బయలుదేరి తంగళ్ళపల్లి మానేరు బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 5 గుంటల భూమి కేటాయించాలని కుటుంబంలో  ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని ఆపమని, మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి న్యాయం చేకూర్చాలని కోరారు.