ప్రభుత్వ వైద్య సేవలు విస్తరించాలి - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

ప్రభుత్వ వైద్య సేవలు విస్తరించాలి - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ప్రభుత్వ వైద్య సేవలు అంచెలంచెలుగా విస్తరించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రూ.37లక్షల వ్యయంతో నిర్మించిన పేషెంట్ల ప్రత్యేక షెడ్డును శుక్రవారం ఎమ్మెల్యే, కలెక్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్ లో వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. రోగులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తగిన మందులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలు ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ నవీన్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.