గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

గుండాల జూలై 03 (ముద్ర న్యూస్): గుండాల మండలంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ.ఆషాఢ శుద్ధ పూర్ణిమని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు అని అన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. ప్రత్యేక పూజలు క్షీరాభిషేకం శతఘటభిషేకం పుష్పార్చనలు,నిర్వహించారు,మండల పరిధిలోని గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీద్ధ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యంపిటిసి కుంచాల సుశీల అంజిరెడ్డి సాయి బాబా టేస్ట్ సభ్యులు డా. కృష్ణ సూదగాని రామచంద్రయ్య గౌడ్ పొడిచేటి వెంకన్న  సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.