సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

ముద్ర సిరిసిల్ల టౌన్:-ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్ట్ విచారణకు స్వీకరించకుండా తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీచౌక్ లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, రాజకీయ కక్ష సాధింపు ధోరణి ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిందం శ్రీనివాస్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నక్క నరసయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు సతీష్ రెడ్డి, మల్ల భాను, వంగ మల్లేశం, తడక వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు కాసర్ల రాజు, రియాజుద్దీన్, ఫయాజుద్దీన్, పర్వేజ్, అన్నల్ దాస్ భాను, వేణు, తదితరులు పాల్గొన్నారు.