25 న జరిగే  చిన్నకోడూరు మండల బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళన సభాస్థలి పరిశీలన

25 న జరిగే  చిన్నకోడూరు మండల బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళన సభాస్థలి పరిశీలన

సిద్దిపేట : ఈ నెల 25న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ కోరారు. సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్  చైర్మన్ కడవెరుగు రాజనర్సు, సిద్దిపేట మున్సిపల్ ప్రస్తుత వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు చిన్నకోడూరు ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఉమేష్ చంద్ర, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ లు సదానందం గౌడ్ ,కనకరాజు, పలువురు పార్టీ నాయకులు, ఎంపీటీసీ లతో కలిసి మండల పరిధిలోని పెద్ద కోడూరు సమీపంలో ఉన్న మెట్టు బండల వద్ద సభస్థలిని రాధాకృష్ణశర్మ పరిశీలించారు.

పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు  స్థల పరిశీలన చేసినట్లు తెలిపారు ఈనెల 25న టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి  ప్లీనరీలు కూడా జరుగుతున్నాయని. ఆరోజు అన్ని గ్రామాల్లో మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ క్యాడర్ జెండాలను ఎగురవేసి సమావేశాలు నిర్వహిస్తారని రాధాకృష్ణశర్మ తెలిపారు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరణ పార్టీకి ఉన్నట్లు తెలిపారు..