విజయం పట్ల విజయోత్సవం  - బిజేపి అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా

విజయం పట్ల విజయోత్సవం   - బిజేపి అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా

ముద్ర, ఎల్లారెడ్డిపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిజేపి అభ్యర్థి ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయం సాధించినందుకు శుక్రవారం మండల కేంద్రంలో బిజేపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. మండల ఉపాధ్యక్షుడు సింగరవేణి కృష్ణ హరి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని రానున్న రోజులలో ఎలక్షన్ ఎప్పుడు జరిగిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నేవురి శ్రీనివాస్ రెడ్డి, బొడవత్ రవీందర్ నాయక్, శ్రీకాంత్, అనూష్,సురేష్, పరశురాములు, భరత్, సాయి,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.