సీఎం కేసీఆర్‌ పాలనలోనే పల్లెల అభివృద్ధి...

సీఎం కేసీఆర్‌ పాలనలోనే పల్లెల అభివృద్ధి...

ముద్ర, గంభీరావుపేట: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని  టేస్కాబ్  చైర్మన్  కొండూరి రవీందర్ రావు అన్నారు. శనివారం గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో ప్రగతి భవన్ కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి టేస్కాబ్  చైర్మన్  కొండూరి రవీందర్ రావు భూమి పూజ నిర్వహించారు.  ఈ సందర్భంగా టేస్కాబ్  చైర్మన్  కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని,రాష్ట్ర అభివృద్ధి  సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో అనతి కాలంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెల స్వరూపాన్ని పూర్తిగా మార్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకునిన్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొమిరిశెట్టి  విజయ లక్ష్మణ్,సర్పంచ్ అంజమ్మ బాల్ రెడ్డి, ఎంపీటీసీ అంజిరెడ్డి,బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సురేందర్, తదితరులు పాల్గొన్నారు.