రాజుర సంఘటన లో పలువురి పైన కేసు నమోదు.. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో   పాటు మరి కొంతమందిపైన

రాజుర సంఘటన లో పలువురి పైన కేసు నమోదు.. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో   పాటు మరి కొంతమందిపైన

ఖానాపూర్, ముద్ర : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రాజుర గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనలో పోలీసులు శనివారం పలువురి పైన కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పైన కొంత మంది వ్యక్తులు మూకుమ్మడిగా వచ్చి, పోలీస్ స్టేషన్ గేటు ను బలవంతం గా తన్ని, పోలీసులను దూసిస్తూ,  విధులను ఆటంకపరిచి, పోలీస్ స్టేషన్ లో సీఐ ఆఫీస్ పైకి రాళ్ళతో దాడి చేస్తూ ఆఫీస్ యొక్క తలుపు రెక్కని, కిటికీ అద్దాలను, మంచి నీటి బాటిల్లను, పూల కుండీలను పగలగొట్టారని వారి పైన కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్, ఎస్ఐ లింబాద్రి తెలిపారు. రాథోడ్ రమేష్,  దేశాయ్ రాము, నాయిని సంతోష్, శెట్టి సంజీవ్, పొలసాని అనిల్ రావు, లాండేరి కిషన్, మరి కొంత మంది పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.