మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత - ఆర్థిక సహాయ అందజేత

మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత - ఆర్థిక సహాయ అందజేత

ముద్ర,రుద్రoగి: తమతోపాటు పదవ తరగతి వరకు చదువుకున్న మిత్రుడు అకాల మరణం చెందడంతో తోటి స్నేహితులు కలత చెందారు.మిత్రుని కుటుంబానికి అండగా నిలబడుదాం అని నిర్ణయించుకున్నారు.అనుకున్నదే తడువుగా తలో కొంత తోచిన కాడికి జమ చేసి రూ 1,00,000 రూపాయల ఆర్థిక సహాయన్నీ బుధవారం రోజున తమ మిత్రుడి కుటుంబ సభ్యులకు అందించారు.వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రానికి చెందిన పిసరి భూమానందం(39) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు..కొన్ని నెలలుగా కిడ్నీలు సంబంధిత వ్యాధితో బాధపడుతూ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. అతనికి భార్య లత(36), ఇద్దరు పిల్లలు వైష్ణవి(16),కీర్తన(11) ఉన్నారు. తమతోపాటు పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్న మిత్రుని మరణాన్ని తోటి స్నేహితులు తట్టుకోలేకపోయారు. పేదరికంలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకున్నారు.

మిత్రుని ఇద్దరు ఆడ పిల్లలు కావడం వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో 2000-01 బ్యాచ్ పదవ తరగతి స్నేహితులు తలాకొంత ఆర్థిక సహాయం అందించారు. అలా వచ్చిన డబ్బులు మొత్తం రూ.1,00,000 అతని భార్య,కుటుంబ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుమానందం కుటుంబానికి ఎప్పుడు తాము అందరు అండగా ఉంటామని అన్నారు..ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఈ కుటంబాన్ని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మర్రిపెళ్లి విలాస్,గడ్డం సంతోష్,జెలందర్,బాస రవి,పడాల పవన్ ,రాచకొండ అశోక్,కదాసు మహేందర్,ఎల్లా గంగాధర్,మర్రిపెళ్లి గంగాధర్,కదాసు నర్సయ్య,ఉప్పులూటీ లక్మినర్సయ్య,ఉప్పులూటీ మహేష్,బైరెడ్డి నరేష్,లంకదాసరి శ్రీనివాస్,బలగం శ్రీధర్  తదితరులు పాల్గొన్నారు..