తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
  • పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, కమలా కిషోర్ కుమార్  దంపతులు
  • ముఖ్యమంత్రి కేసీఆర్ సారుద్యంలో అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానం
  • రానున్న ఎన్నికల్లో  బి ఆర్ ఎస్ దే  విజయం
  • ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గంలోఇప్పటికే వేల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని ప్రజలకు అందుబాటులో ఉండడానికి కోటి రూపాయలతో నిర్మాణమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నియోజకవర్గ కేంద్రంలో నేడు ప్రారంభించామని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు  .బుధవారం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో గత పది సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తూ వచ్చామని అన్నారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమాన్ని ఒకపక్క, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు మరోపక్క ,నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు  .ఇప్పటికే నియోజకవర్గంలో దళిత బంధు, బీసీ బందు, రైతుబంధు ,ఆసరా పింఛన్లు ,కళ్యాణ లక్ష్మి, రైతు బీమా,లాంటి పథకాలు అప్రతిహతంగా అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సామాజిక వర్గాల వారికి అన్ని కులాలు, మతాల వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అందుకే ప్రజలు రెండుసార్లు అధికారం ఇచ్చారని మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ వారి వారి పండుగల సందర్భంగా వారి సంప్రదాయ బద్ధంగా కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నారని రానున్న బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ చీరలు పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు .

రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఏదో ఒకటి ప్రతి కుటుంబానికి చేరుతుందని ఇది వాస్తవం అని అన్నారు. ఇంత పారదర్శకమైన ప్రభుత్వం గతంలో ఏనాడు రాలేదని అన్నారు. దేశంలో అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని దానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న చేస్తున్న వివిధ రకాల పథకాలే కారణమన్నారు .పక్క రాష్ట్రాలు సైతం తెలంగాణలో అమలవుతున్న పథకాలను తమ తమ రాష్ట్రాలు అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో మరో మారు గులాబీ జెండా  ఎగరడం ఖాయమని ప్రజలు మరో మారు అభివృద్ధి సంక్షేమానికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు . ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే సతీమణి కమలా కిషోర్ కుమార్ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు ,జిల్లా రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ ఎస్సై రజాక్  ,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు ,పులుసు యాదగిరి గౌడ్ లతోపాటు పలువురు  9 మండలాల నాయకులు కార్యకర్తలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.