జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ ల  చిత్ర పటాలకు పాలాభిషేకం..

జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ ల  చిత్ర పటాలకు పాలాభిషేకం..

వెల్గటూర్, ముద్ర :  వెల్గటూర్ మండలంలోని, స్తంభంపల్లి గ్రామ శివారులో గతంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ప్రాక్టరీని రద్దు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ నాయకులు హరిత హోటల్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డిసీసీ జిల్లా అధ్యక్షుడు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల చిత్రపటాల ఆవిష్కరించి బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  శాసనమండలిలో ఇక్కడి పరిస్థితిని వివరించి, ప్రజల గలాన్ని  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు. ఎమ్మెల్సీ జీవనరెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు  టి. సైలెందర్, నాయకులు బందెల ఉదయ్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.