రైతుల పక్షాన జిల్లా అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ

రైతుల పక్షాన జిల్లా అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ

ముద్ర సిరిసిల్ల టౌన్: ఆకాల వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటకు ఎకరానికి 25000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేశారు. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ చెప్పారు. ఆకాల వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న మొక్క జొన్న, మామిడి తోట, వరి, కూరగాయలు, నువ్వుల  పంట రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా యస్ సి సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్, చొప్పదండి ప్రకాష్, కాసర్ల రాజు, జాలగం ప్రవీణ్, పాసుల వెంకటేష్, జడ్పీటీసీ నాగం కుమార్, పండుగ ప్రదీప్, గంభీరావుపేట ప్రశాంత్, అరపల్లి బాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు...