20న ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్ 

20న ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ఈ నెల 20 వ తేదీన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ అనురాగ్ జయంతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 20 న ఐ డి ఓ సి  కాన్ఫరెన్స్ హల్ నందు ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ సమావేశం ఉన్న దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు విషయాన్ని గ్రహించి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.