యువకుని ఊపిరి ఆగింది

యువకుని ఊపిరి ఆగింది
  • 33 ఏళ్లకే మృత్యువాత 
  • కేసీఆర్ కాలనీలో గుండెపోటుతో  యువకుడి మృతి

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్ కాలనీలో నివసిస్తున్న అల్లే మధు 33 అనే యువకుడు శనివారం తెల్లవారుజామున తన ఇంటి ఆవరణలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వెంటనే మృతుడిని భార్య లావణ్య కాలనీవాసుల సహాయంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా  అప్పటికే ప్రాణం పోయిందని గుండెపోటే కారణమని  వైద్యులు పేర్కొన్నారు. మృతునికి తల్లిదండ్రులు లేకపోవడంతో భార్య లావణ్యతో కలిసి జీవిస్తున్నాడు. లావణ్యతో గత తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం కాగా వీరిద్దరికీ సంతానం లేక పలు ఆస్పత్రులు తిరుగుతూ మందులు వాడుతున్నప్పటికీ సంతానం కలగలేదని అత్త మామ లేని నాకు భర్త కూడా దూరమయ్యాడని  లావణ్య విలపిస్తూ కన్నీరు మున్నీరయింది. ఈ సంఘటనతో కేసీఆర్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మధు గుండెపోటుతో మరణించగా  తన భార్య లావణ్య అనాధగా మారిందని ప్రభుత్వపరంగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కాలనీవాసులు  కోరుచున్నారు.