అక్టోబర్ 23వ తేదీ సోమవారం నాడే దసరా పండుగ - సిరిసిల్ల పద్మ బ్రాహ్మణ పురోహితుల సంఘం

అక్టోబర్ 23వ తేదీ సోమవారం నాడే దసరా పండుగ - సిరిసిల్ల పద్మ బ్రాహ్మణ పురోహితుల సంఘం

సిరిసిల్ల టౌన్, ముద్ర: దసరా పండుగను అక్టోబర్ 23వ తేదీ లేదా 24వ తేదీ ఏ తేదీలలో నిర్వహించాలని సంశయాన్ని సిరిసిల్ల పద్మ బ్రాహ్మణ పురోహితుల సంఘం వారు నివృత్తి చేశారు. జిల్లా ప్రజలు, పట్టణ ప్రజలు అయోమయంలో ఉన్నందున పద్మ బ్రాహ్మణ పురోహితులు, పద్మశాలి అనుబంధ సంఘాల అధ్యక్షులు, అలాగే జిల్లా లోని వివిధ సంఘాల అధ్యక్షులతో చర్చించి అక్టోబర్ 23వ తేదీ సోమవారం దసరా పండుగను నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు. సోమవారం మధ్యాహ్నం నుండి దశమి తిథి ఉండటం, శ్రవణా నక్షత్రం సోమవారం నాడే ఉండటంతో 23వ తేదీ సోమవారం పండుగను, సాయంత్రం శమీ దర్శనం చేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రామాణిక గ్రంథాల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం మరియు రాష్ట్ర పండితుల విద్వత్సభ కూడా 23వ తేదీ సోమవారం రోజునే దసరా పండుగ ను చేసుకోవాలని సూచించారని పద్మ బ్రాహ్మణ పురోహితుల సంఘం అధ్యక్షులు కోడూరి విజయ్ భాస్కర్ తెలిపారు.