వర్షాలు సమృద్ధిగా కురవాలని ముడుపు విప్పిన రైతులు
![వర్షాలు సమృద్ధిగా కురవాలని ముడుపు విప్పిన రైతులు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647b0956f3d35.jpg)
ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక రావి చెట్టు హనుమాన్ గుడిలో శనివారం హనుమండ్ల పంతులు తో కలిసి రెండు నెలల క్రితం కట్టిన ముడుపును రైతులు విప్పారు వరి కోతల ముందు అకాల వర్షాలు పడకుండా అన్నదాతలను కాపాడాలని రైతులు ముడుపు వేయగ అట్టి ముడుపును వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కులు చెల్లించి ముడుపును విప్పారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాన్ని రైతులు పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి, రావుల ఎల్లారెడ్డి, పారిపెల్లి రామ్ రెడ్డి, యమగోండ కృష్ణారెడ్డి, దొంతి రామచంద్రారెడ్డి, చిట్టి సతీష్ కుమార్, మద్దుల అంజిరెడ్డి, మంకెన్ చంద్రారెడ్డి, బందారపు మల్లారెడ్డి, బంగ్లా బాల్ రెడ్డి, వంగ శ్రీకాంత్ రెడ్డి, గన్న కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.