పంటలు బాగా పండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి
![పంటలు బాగా పండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d3819814093.jpg)
పంటలు బాగా పండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి
కమాన్ పూర్ పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు దేవతలను వేడుకున్నారు.
కమాన్ పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామములో శ్రీ భూలక్ష్మీ శ్రీ లక్ష్మి బొడ్రాయి పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి,మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.
భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ తల్లుల దీవెనలు తెలంగాణ ప్రజల పైన నిండుగా ఉండాలి. అని అన్నారు.వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండెలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ షీలారపు మల్లయ్య శశి భూషణ్ కాచే బొంపల్లి రాజయ్య బిల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.