రామానుజమ్మని సత్కరించిన కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ 

రామానుజమ్మని సత్కరించిన కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ 

సిరిసిల్ల టౌన్, ముద్ర:ఇటీవల మలేషియా లో జరిగిన 35వ ఇంటర్నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2023 లో సిరిసిల్ల కు చెందిన టమటం రామానుజమ్మకి 55 సంవత్సరాల పై బడిన కేటగిరి లో 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ నుండి ఈ పతకాన్ని పొందిన ఏకైక మహిళగా గుర్తింపు పొందిన టమటం రామానుజమ్మని స్థానిక వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.