ముద్రకు స్పందన

ముద్రకు స్పందన

 ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాత్రిపూట హరితహారం చెట్ల నరికివేత కథనంపై  ఎల్లారెడ్డిపేట మండల ఎంపీడీవో చిరంజీవి విచారణ చేపట్టారు. ముద్ర లో కథనం ప్రచూరితమైన 30 నిమిషాల వ్యవధిలో ఎంపీడీవో చెట్లను నరికి వేసిన నిందితులపై  చర్యలు తీసుకుంటున్నట్లు ముద్రతో పేర్కొన్నారు. హరితహారం లో భాగంగా  నాటిన మొక్కలను, చెట్లను ఎవరు నరికేసిన  కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.