పేపర్ లీక్ కేసును సీబీఐకి ఇవ్వాలి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రాజకీయ నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ కు, ఆయన పీఏకు లీకేజీ మరకలు అంటుకున్నాయి. కేసులో సీబీఐ విచారణకు కాంగ్రెస్, బీజేపీ డిమాండ్చేస్తున్నాయి. హైకోర్టుకు పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర్ భార్య వెళ్లింది. సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్డిమాండ్ చేశారు.
రేపు పేపర్ లీకేజీ కేసుపై గవర్నర్ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న పేపర్ లీకేజీ కేసు. దీన్ని సీబీఐకి అప్పగించాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. సిట్ విచారణ వద్దంటున్న రాజకీయ పార్టీలు.