19వ వార్డ్ లో 2 వ విడత కంటి వెలుగు కార్యక్రమం

19వ వార్డ్ లో 2 వ విడత కంటి వెలుగు కార్యక్రమం

ముద్ర సిరిసిల్ల టౌన్; రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని 19వ వార్డ్ లో స్థానిక కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమంను మున్సిపల్ చైర్ పర్సన్  జిందం కళ చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని  ప్రారంభించారు. కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ మాట్లాడుతు 19 వ వార్డ్ లోని పంచాయత్ రాజ్ అతిధి గృహం లో ఈరోజు నుండి వరుసగా 7 రోజులపాటు ఇట్టి కంటి వెలుగు శిబిరాన్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడునని ప్రజలందరూ ఇట్టి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వారి యొక్క కంటి సమస్యలను పరిష్కరించుకునేలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ గడ్డం చందన భగవాన్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.