వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం..

వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ లో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి గాను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కి మంగళవారం రూ. లక్ష అందజేశారు. జిల్లాలోని భక్తుల సౌకర్యార్ధం, లోకకల్యాణం కోసం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చొరవతో ప్రత్యేకంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి తమ వంతు విరాళంగా భూపాలపల్లి లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం కట్ల మోహన్ రెడ్డి రూ.50 వేలు, ఆర్ కే సూపర్ మార్కెట్ యాజమాన్యం ధనుమంతురావు రూ.50వేలు మొత్తం రూ.లక్ష ను క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి, ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ కార్యంలో అందరూ భాగస్వామ్యులు కావాలని, సెప్టెంబర్ రెండో వారంలో ఆలయ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.