కెసిఆర్ ను సాగనంపితేనే తెలంగాణ అభివృద్ధి..

కెసిఆర్ ను సాగనంపితేనే తెలంగాణ అభివృద్ధి..
  • గండ్ర సత్యనారాయణరావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఇంటికి సాగనంపితేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని సింగరేణి ఐదవ గనిలో గురువారం టిపిసిసి సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు గేట్ మీటింగ్ లో పాల్గొని సింగరేణి కార్మికులతో మాట్లాడారు. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనపై అధికార పార్టీ నాయకులు కక్ష కట్టి ఓడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, డబ్బు సంచులతో బయలుదేరి, ప్రజరను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఐఎన్ టీయుసీ నాయకులు జోగు బుచ్చయ్య, రాజేందర్, వేణుగోపాల్, బండి శ్రీను, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీనివాస్, 16వ వార్డ్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, టౌన్ యూత్ అధ్యక్షులు పృథ్వి, చరణ్, విజయ్, అనిల్ పాల్గొన్నారు.