మిట్టపల్లికి కీలక బాధ్యతలు..

మిట్టపల్లికి కీలక బాధ్యతలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లికి చెందిన సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ కు బీఆర్ఎస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ లు హాజరయ్యే ఎన్నికల ప్రచార, ప్రజా ఆశీర్వాద సభల బాధ్యతలు అప్పగించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కేసిఆర్ పాల్గొనే అన్ని వేదికలలో ప్రచార భాద్యతలు రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ కి అప్పగిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ గురువారం ప్రకటించారు.

హైదరాబాదులో కేటీఆర్ గురువారం మిట్టపల్లి సురేందర్ ని  తన నివాసంకి పిలిపించుకుని స్థానిక భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి సమక్షంలో బాధ్యతలు అప్పగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్బంగా ఈ ఎన్నికలు అయిపోయే వరకు అన్ని వేదికలపైన మిట్టపల్లి సురేందర్ బృందంతో తెలంగాణాలో జరిగిన  అభివృద్ధి, సంక్షేమఫలాల మీద ఆట, పాటలు ఉండనున్నాయి. ఈ సందర్బంగా ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ కు మిట్టపల్లి సురేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన సొంత నియోజకవర్గానికి చెందిన మిట్టపల్లి సురేందర్ కు ప్రచార భాద్యతలు అప్పగించినందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి  హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.